ప్రభాస్‌, వైఎస్‌ షర్మిలల మద్య అసలు సంబంధం ఇది


కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్‌కు షర్మిలకు సంబంధించిన వార్తలు కొన్ని టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ వార్తలు అప్పట్లో ఎందుకు వచ్చాయో ఏ ఒక్కరు ఊహించలేక పోయారు. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. అంటే ఏదో జరిగే ఉంటుందని, ఇద్దరికి ఏదో విషయంలో సంబంధం ఉండే ఉంటుందని, అందుకే ఆ వార్తలు వచ్చాయని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి మద్య సంబంధం ఏంటో తేలిపోయింది. ప్రభాస్‌, షర్మిలకు మద్య సంబంధంకు కారణం ‘యోగి’ సినిమా అని తేలిపోయింది.

వైఎస్‌ షర్మిలకు అనీల్‌కు ముందు మరో భర్త ఉండేవాడు. ఆయనే చంద్రప్రతాప్‌ రెడ్డి. ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రభాస్‌ హీరోగా వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యోగి’ సినిమాను షర్మిల మొదటి భర్త చంద్ర ప్రతాప్‌ రెడ్డి నిర్మించడం జరిగింది. ఆ సమయంలోనే ప్రభాస్‌తో షర్మిలకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కేవలం హాయ్‌ బాయ్‌ వరకు సాగింది. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడం, ఆ తర్వాత కొన్నాళ్లకు చంద్ర ప్రతాప్‌ రెడ్డి చనిపోవడం జరిగింది. ఆ వెంటనే అనీల్‌ను షర్మిల పెళ్లి చేసుకుంది. ఇంతే తప్ప ఇద్దరి మద్య మరేం సంబంధం లేదని అంటున్నారు. షర్మిల గురించి ఎవరో అలాంటి చెత్త వార్తలు పుట్టించారని, ఇద్దరి మద్య ఈ చిన్న సంబంధం మినహా మరేం లేదని క్లారిటీ వచ్చేసింది.